చిత్ర కళకు కేరాఫ్ పల్లం పిచ్చయ్య.. అమేజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ టాలెంట్ వరల్డ్ రికార్డు సొంతం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||చిత్ర కళకు కేరాఫ్ పల్లం పిచ్చయ్య||

(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని బుద్ధాల కన్వెన్షన్ హాలులో 30 గంటలు 30 నిమిషాల 30 సెకండ్ల పాటు జరిగిన ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాత్కాలిక చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తెలంగాణ ముద్దుబిడ్డ పల్లం పిచ్చయ్య అమేజింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ (టీఎస్ ఏ బుక్ ఆఫ్ రికార్డ్) ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్, కల్చరల్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డులలో పల్లం పిచ్చయ్య పేరు నమోదు చేసినట్లు ధృవీకరిస్తూ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శాలువా జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్లం పిచ్చయ్య పాల్గొని"కళాకారుడి పై వేదన"అనే అంశంపై కవితలు అద్భుతంగా చదివి ఐఎస్ఓ గుర్తింపు పొందిన ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ అయిన శ్రీ శ్రీ కళావేదిక ద్వారా తన పేరు రికార్డు చేసుకున్నారు‌.గతంలో ప్రపంచ తెలుగు సాహితీ సభలలో అవార్డులు తీసుకోవడం కూడా జరిగింది కాకరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాత్కాలిక చిత్ర కళ

 ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కథలు చదవడం కవితలు రాయడం వ్యాపకంగా చేసుకొని కవులు రచించిన కవితలకు తగినట్లుగా చిత్రాలు వేయడం ద్వారా ప్రసిద్ధి పొందారు. ఎందరో సాహితీ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడంతో పాటు గతంలో చిత్రకారులుగా వివిధ సాహితీ సంస్థలు చిత్రకళా వేదికలపై చిత్రకళారత్నం చిత్రకళా శేఖర చిత్రకళా సేవారత్న చిత్రకళ వల్లభా బిరుదులతో పాటు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలోని అక్కినేని నాగేశ్వరరావు కళాక్షేత్రంలో నటా వారిచే నంది అవార్డుతో సన్మానం చేయడం జరిగింది ‌ ఈ విధంగా 50 సన్మానాలు శాలువులతో జ్ఞాపికలు 80 ప్రశంసా పత్రాలు అందుకోవడం వారు కుటుంబ సమేతంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్లంపిచ్చయ్య వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్న నేపథ్యంలో సృజన సాహితీ వేదిక నిర్వాహకులు గార్లపాటి రామకృష్ణ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు బొల్లేపల్లి మధుసూదన రాజు, విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు, గట్టే వాసు, లైవ్ స్వచ్ఛంద సంస్థ గండ్ర కిషోర్ కుమార్ రెడ్డి తేళ్ళూరి ఆడమ్స్ నవరస కళాపరిషత్ నిర్వాహకులు రాంబాబు రెడ్డి కట్ట శ్రీనివాసరావు టీచర్ అగ్రో ఇండస్ట్రీ నర్సింగరావు తదితరులు పల్లం పిచ్చయ్యకు అభినందనలు తెలిపారు.

వెబ్ స్టోరీస్