విడాకుల తర్వాత తొలిసారి సమంత గురించి మాట్లాడిన నాగచైతన్య.. ఏమన్నాడంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||నాగచైతన్య, సమంత Photo: twitter||

ఈవార్తలు, సినిమా న్యూస్: అక్కినేని వారసుడు నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకొని రెండేళ్లు అవుతోంది. ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. దాని గురించి వారిద్దరు ఎప్పుడూ మాట్లాడలేదు. విడాకులు తీసుకున్నాం అని మాత్రమే స్పష్టం చేశారు. ఇక, సమంత గురించి ఏ సందర్భంలోనూ మాట్లాడని నాగచైతన్య తొలిసారి.. సమంత గురించి మాట్లాడాడు. కస్టడీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగచైతన్య.. సమంతతో చట్టప్రకారం విడాకులు తీసుకొని సంవత్సరం అయ్యిందని తెలిపాడు. సమంత మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడాడు. జీవితంలో ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడించాడు. ‘మేం ఇద్దరం విడిపోయి రెండేళ్లు అవుతోంది. కోర్టు విడాకులు ఇచ్చి సంవత్సరం అవుతోంది. ఇప్పుడు మేమిద్దరం ఎవరి జీవితాల్లో వారు ముందుకు సాగిపోతున్నాం’ అని చెప్పాడు.

సమంత మంచి మనిషి అని, ఆమె సంతోషంగా ఉండాలని చెప్పిన నాగచైతన్య.. ఇంటర్నెట్‌లో వచ్చిన పుకార్ల వల్లే తమ మధ్య పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయని, తమ మధ్య గౌరవం లేన్నట్లు ప్రజల్లోకి వెళ్లిందని చెప్పాడు. అయితే, ఈ వ్యవహారంలో మరో వ్యక్తిని లాగి వార్తలు రాశారని, దానివల్ల ఆ మూడో వ్యక్తిని ఇబ్బందులు పెట్టినట్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కినేని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటాన్ని ప్రస్తావిస్తూ.. త్వరలోనే మంచి విజయాలతో ప్రేక్షకులకు దగ్గరవుతామని తెలిపాడు.



వెబ్ స్టోరీస్