మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇదే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||చిరంజీవి, నవీన్ పొలిశెట్టి Photo: instagram||

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న జాతి రత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి, దేవసేన అనుష్క శెట్టి సినిమా 100 శాతం ఎంటర్‌టైనర్ అని మెగాస్టార్ చిరంజీవి కితాబిచ్చారు. సినిమా విడుదలకు ముందే ఆ సినిమాను చూశానని, ఫుల్ కామెడీ అని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన రివ్యూను పోస్ట్ చేశారు. 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి 'దేవసేన', అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేశ్ బాబుని అభినందించాల్సిందే. BTW ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి  మిస్టర్ పోలిశెట్టి 100 శాతం ఆడియన్స్‌ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు.’ అని పేర్కొన్నారు.

వెబ్ స్టోరీస్