||భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్||
ఈవార్తలు, సినిమా న్యూస్: తెలుగు సినీ అభిమానులకు మాస్ విందు అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి వచ్చేశాడు. ఆయన హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ భోళా శంకర్ ట్రైలర్ విడుదలైంది. కీర్తి సురేశ్, తమన్నా నటిస్తున్న ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకుడు. సోదరి సెంటిమెంట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.
ట్రైలర్లో చిరంజీవి జోష్గా కనిపించారు. తనదైన డైలాగ్స్, పంచ్లు, హావాభావాలతో మెప్పించారు. ట్రైలర్ మొదట్నుంచి మంచి ఎనర్జీ కనిపించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను ఇమిటేట్ చేసి అభిమానులకు హాట్ కేక్ విందు అందించాడు చిరు. ట్రైలర్ను చూస్తుంటే సినిమా గొప్ప ఎంటర్టైనర్గా నిలుస్తుందని అనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.