|| భైరవ ద్వీపం సినిమా పోస్టర్ PHoto: Youtube||
నటసింహం బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే న్యూస్. బాలయ్య సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్గా నిలిచిన భైరవద్వీపం సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. సినీ ఇండస్ట్రీలోకి బాలకృష్ణ అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి కాబోతున్న సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 4K ట్రైలర్ను కూడా విడుదల చేశారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ జానపద చిత్రం.. ప్రేక్షకులను విశేషంగా అలరించింది. రోజా సెల్వమణి హీరోయిన్గా నటించగా, రంభ స్పెషల్ క్యారెక్టర్లో మెరిసింది. 1994లో విడుదలైన ఈ చిత్రాన్ని విజయ కంబైన్స్ పతాకంపై బీ వెంకట్రామిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి రావి కొండలరావు కథ, మాటలు అందించాడు. మాధవరెడ్డి సురేశ్ మ్యూజిక్ డైరెక్టర్. 1994లో మూడవ ఉత్తమ చిత్రంగా భైరవ ద్వీపం నంది పురస్కారాన్ని అందుకుంది.
కాగా, బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆగస్టు 29వ తేదీకి 50 ఏళ్లు పూర్తవుతుంది. 1974లో తాతమ్మ కల చిత్రంతో బాల నటుడిగా సినిమాల్లోకి వచ్చారు. ఈ చిత్రానికి బాలకృష్ణ తండ్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1974 ఆగస్టు 29న విడుదలైంది. మంగళవారానికి ఆయన సినిమా కెరీర్ 50 ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో భైరవ ద్వీపం విడుదల చేయనుండటంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. 4కే ట్రైలర్ చూసి బాలయ్య బాబు నటనను వేనోళ్ల పొగుడుతున్నారు. ఆ ట్రైలర్ మీరూ చూసేయండి..