Shilpa Shetty | విడాకులు తీసుకోబోతున్న మరో బాలీవుడ్ స్టార్ జంట!

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి Photo: Instagram||

బాలీవుడ్‌లో విడాకుల హడావుడి కామన్. కొన్నేండ్లు కలిసి ఉండటం, పిల్లల్ని కనడం, తర్వాత నచ్చక విడిపోవడం. ఇలా చాలా జంటలు తమ దాంపత్య జీవితానికి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. టాలీవుడ్‌లోనూ ఈ మధ్య నాగచైతన్య, సమంత పెళ్లి అయిన కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. తాజాగా, స్టార్ జంట శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా తాజాగా పెట్టిన పోస్టే ఇందుకు కారణం. ఆయన తన ట్విట్టర్ వేదికగా.. ‘మేం విడిపోతున్నాం. దయచేసి ఈ కఠిన సమయంలో మాకు మద్దతుగా నిలవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌లో శిల్పాశెట్టి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.

ఈ ట్వీట్‌ను చూసినవాళ్లంతా విడాకులేనని అంటున్నారు. అందుకే హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ కూడా జత చేశాడని మాట్లాడుకుంటున్నారు. కాకపోతే శిల్పాశెట్టి సోషల్ మీడియాలో మాత్రం విడాకులకు సంబంధించి ఎలాంటి పోస్ట్ లేదు. అంతేకాదు.. శిల్పాశెట్టి దంపతులు కొత్త సినిమా యూటీ 69కు శుభాకాంక్షలు చెప్తూ పోస్ట్ చేసింది. 

కాగా, గతంలోనూ వీరిద్దరు విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. రెండేళ్ల క్రితం బ్లూ ఫిల్మ్స్ కేసులో అరెస్టయ్యారు. రాజ్ కుంద్రా నీలిచిత్రాల విషయం బయటపడ్డాక శిల్పాశెట్టి తన దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు గతంలో గుసగుసలు వినిపించాయి. కానీ, తర్వాత వారిద్దరు కలిసే జీవితాన్ని కొనసాగిస్తూ, ఆరోపణలకు చెక్ పెట్టారు. తాజాగా, రాజ్ కుంద్రా ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వెబ్ స్టోరీస్