హస్తినాపురంలో గృహిణి ఆత్మహత్య

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

(ఈవార్తలు, ఎల్బీనగర్ ప్రతినిధి, దేవులపల్లి రంగారావు)

జీవితంపై విరక్తితో గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎల్బీనగర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన ధనుంజయ, స్వాతి (33) దంపతులు ఇద్దరు కుమారులతో కలిసి హస్తినాపురం షిరిడి సాయినగర్ లో ఉంటున్నారు. ధనుంజయ ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం స్వాతి టిఫిన్ చేసి భర్తకు లంచ్ బాక్స్ పెట్టి పంపింది. పిల్లలను స్కూలుకు పంపింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని పడక గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కారని సూసైడ్ నోట్ రాసి, ఘటనకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు.

వెబ్ స్టోరీస్