రేపటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||శ్రీశైలం ఆలయం||

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు వెల్లడించారు. ఈ నెల 12 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. శుక్రవారం సాయంతం ధ్వజారోహణతో ఉత్సవాలు పారంభమవుతాయని తెలిపారు. ఉత్సవాల్లో రాత్రి వేళ స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత హోమాలు నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. కాగా, డిసెంబర్ 13వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును బుధవారం లెక్కించారు. మొత్తం 28 రోజుల్లో రూ.4,38,53,238 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. నగదుతో పాటు 133 గ్రాముల బంగారం, 11.850 కిలోల వెండి వచ్చిందని వివరించారు.

వెబ్ స్టోరీస్