Chandrababu | తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు రూ.99,999 విరాళం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ ప్రజల నుంచి విరాళాలు కోరుతోంది. ఎన్నికల్లో ఖర్చులకు, పార్టీ భవిష్యత్తుకు తమ వంతు సాయం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.

tdp chandrababu
టీడీపీకి చంద్రబాబు విరాళం

ఈవార్తలు, అమరావతి న్యూస్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ ప్రజల నుంచి విరాళాలు కోరుతోంది. ఎన్నికల్లో ఖర్చులకు, పార్టీ భవిష్యత్తుకు తమ వంతు సాయం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు విరాళాలు ఇచ్చేందుకు ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. తన వంతుగా తొలి విరాళం రూ.99,999 అందజేశారు. ‘తెలుగుదేశం అనేది తెలుగు ప్రజల జీవితాల్లో ఒక భాగం. నేడు తెలుగుదేశం గెలుపు.. పార్టీ కంటే రాష్ట్రానికి ఎంతో అవసరం. అందుకే పార్టీని నడిపించే బాధ్యతలో భాగస్వాములవ్వాలని ప్రజలను కోరుతున్నాను. రాష్ట్ర ప్రగతి కోసం....మన బిడ్డల భవిష్యత్తు కోసం మన తెలుగుదేశం అనే నినాదంతో వెబ్‌సైట్‌ను తీసుకువచ్చాం. తెలుగుదేశం విధానాల వల్ల ప్రయోజనం పొందినవాళ్లు, తెలుగుదేశం వల్ల రాష్ట్రానికి జరిగిన మేలును గుర్తించినవాళ్లు., టీడీపీతోనే భవిష్యత్తు ఉంటుందని నమ్మేవాళ్లు. విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాను’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

‘విరాళాల కోసం https://tdpforandhra.com పేరుతో ఈ రోజు వెబ్ సైట్ ను ఆవిష్కరించాను. దీని ద్వారా సులభంగా పార్టీకి విరాళం ఇవ్వొచ్చు. తద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పోరాడుతున్న పార్టీకి మీరు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. మీ విరాళం కేవలం డబ్బు మాత్రమే కాదు. ఒక స్ఫూర్తి. తొలి విరాళంగా నేను రూ.99,999లను పార్టీకి అందజేసాను. మీరు కూడా విరాళం ఇవ్వండి... మరో ముగ్గురికి పిలుపునిచ్చి ఇందుకు ప్రోత్సహించండి’ అని టీడీపీ అధినేత కోరారు.

వెబ్ స్టోరీస్