డాక్టర్ పిచ్చయ్య యమధర్మరాజు ఏకపాత్రాభినయంతో దద్దరిల్లిన త్యాగరాయగాన సభ: వంశీ రామరాజు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||డాక్టర్ పిచ్చయ్యకు సన్మానం||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

డాక్టర్ పిచ్చయ్య ప్రదర్శించిన యమధర్మరాజు ఏకపాత్రాభినయంతో త్యాగరాయ గాన సభ దద్దరిల్లిందని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు. పరిస పరిమళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు త్యాగరాయ గాన సభ వేదికపై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలానికి చెందిన డాక్టర్ గుంటి పిచ్చయ్య ప్రదర్శించిన యమధర్మరాజు ఏకపాత్రాభినయం పలువురు ప్రేక్షకులను మంత్రం వృద్ధులను చేసింది. ఈ సందర్భంగా జరిగిన సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ గాయని గాయకుల గానాలాపనతో పాటు పలు ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సినీ డైరెక్టర్ రాజశేఖర్ హీరో వినోద్‌తో పాటు ఇందు వదన శ్రీనివాస్ డాక్టర్ గుంటి పిచ్చయ్య నటనను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయంటే డాక్టర్ గుంటి పిచ్చయ్య లాంటి వ్యక్తుల నటనే కారణమని కొనియాడారు. అనంతరం డాక్టర్ గుంటి పిచ్చయ్యను హీరో వినోద్ డైరెక్టర్ రాజశేఖర్ కవులు కళాకారులు సత్కరించారు. షార్ట్ ఫిలిం నటుడు పారిశ్రామికవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు కవులు కళాకారులు గాయనీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెబ్ స్టోరీస్