ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌజ్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10:30 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్కు చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించి, రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత 3 గంటలకు శాభాష్పల్లి వంతెనపైకి చేరుకొని మిడ్మానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం)ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలోని తెలంగాణభవన్కు చేరుకొని మీడియాతో మాట్లాడతారు. ఈ సందర్భంగా ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణమై ఎర్రవల్లి ఫాంహౌజ్కు ఆయన చేరుకుంటారు.