చొప్పదండి నియోజకవర్గంలో బొడిగ శోభకే అవకాశాలు.. గంపగుత్తగా ఓట్లు ఆమెకే!

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||బొడిగ శోభను ఆప్యాయంగా పలకరిస్తున్న ఓ వృద్ధురాలు||

బొడిగ శోభ.. ఈ పేరు వింటే మహిళలకు ఒక వైబ్రేషన్. ఆమె వస్తుందంటే ఆడవాళ్లంతా ఆమె చుట్టూ గుమిగూడిపోతారు. తమ ఇంటి ఆడపడుచు వచ్చిందన్న ఆనందంతో ఉంటారు. శోభ కూడా అంతే కలివిడిగా ప్రజల్లో కలిసిపోతారు. ఏ ఒక్కరు కనిపించినా అన్నా, తమ్మీ.. అక్కా, చెల్లె అని ప్రేమతో గుండెల నిండా పిలుస్తారు. ఆ కలివిడి తనమే ఆమెను మహిళలకు దగ్గర చేసింది. ఒకవిధంగా ఆమెను తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మహిళా శక్తిగా అభివర్ణించవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అసెంబ్లీలో అడుగుపెట్టిన బొడిగ శోభ అలియాస్ శోభక్క అలియాస్ శోభక్క గాలన్న.. అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు. ఎక్కడికి వెళ్లినా తన ఇజాన్ని చూపిస్తారు. ఆమె మాటలు ఎంత సూటిగా ఉంటాయో, ఆమె చేసిన అభివృద్ధి పనులు కూడా అంతే పకడ్బందీగా ఉంటాయి. ప్రస్తుతం చొప్పదండి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాల్లో ఆమె పేరుతోనే ఎక్కువ స్థాయిలో ఉన్నాయంటే.. అభివృద్ధి కార్యక్రమాల్లో శోభక్క ఎంత చురుగ్గా పాల్గొనేవారో అర్థం చేసుకోవచ్చు. ఆపదలో ఉన్నవారు ఎవరైనా అక్కా.. ఇదీ! కష్టం అని పోతే, నేనున్నానని పలకరించి, ధైర్యం చెప్తారు.

2014 ఎన్నికల్లో గెలిచి చొప్పదండి నియోజకవర్గంలో ఊరూరా తన పేరును సుస్థిరం చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటు ఇవ్వకపోవటంతో తీవ్ర మనస్థాపానికి గురైనా, మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేశారు. బీజేపీ పార్టీలో చేరి ప్రజల్లోకి వెళ్లారు. ఎన్నికల్లో నిరాశే ఎదురైనా, ఆమె మాత్రం ప్రజల నుంచి దూరం జరగలేదు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజలతోనే గడిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ బీజేపీ ఫైర్ బ్రాండ్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి సారథ్యంలో బీజేపీ గెలుపు కోసం నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు.

నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు బీఆర్ఎస్‌కు అంతగా అనుకూలంగా లేవనే చెప్పాలి. చాలా పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిపోవటం బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ప్రతికూలంగా మారాయి. కాంగ్రెస్ పరిస్థితి ఆ మధ్య మెరుగైనట్లు కనిపించినా, ఢీలా పడిపోయింది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మళ్లీ బొడిగ శోభక్కదే గెలుపు అన్న మాటలు వినిపిస్తున్నాయి. వృద్ధులు, మహిళలు, యువత బొడిగ శోభక్కనే గెలిపిస్తాం అంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో అన్ని పార్టీలు తమ గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత పాలనానుభవం, ప్రజల్లో ఉన్న పేరు తనకు కలిసి వస్తుందని బొడిగ శోభ ఆశాభావంతో ఉన్నారు. ఈసారి కచ్చితంగా గెలిచి తీరుతానని స్పష్టం చేస్తున్నారు. ప్రజల అండతో మరోసారి అసెంబ్లీలో అడుగు పెడతానని, ప్రజా సమస్యలపై పోరాడుతానని చెప్తున్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

వెబ్ స్టోరీస్