ప్రజల ఆశీర్వాదమే నా బలం: సబితా ఇంద్రారెడ్డి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రజల ఆశీర్వాదమే నా బలం: సబితా ఇంద్రారెడ్డి||

(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

ప్రజల ఆశీర్వాదమే తన బలము అని రాష్ట్ర మాజీమంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం కొత్తపేట డాక్టర్స్ కాలనీలో జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన బలం బలగం మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు అని ఆమెకితాబు ఇచ్చారు. డాక్టర్స్ కాలనీలో కాలనీ కార్యవర్గం చేస్తున్న సేవా కార్యక్రమాలు పత్రికల్లో చదివి చాలా సంతోషించానని ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. కాలనీ ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యల పరిష్కారానికి శాసనసభ్యురాలు తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిగిని రామ్మూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శి టీ శ్రీనివాస్, వీ దయాకర్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

వెబ్ స్టోరీస్