Yuvagalam | అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||చంద్రబాబు||

టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయులు హామీ ఇచ్చారు. విశాఖలో జరుగుతున్న యువగళం ముగింపు సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘అమరావతి, తిరుపతిలో సభలు పెడతాం. అందులో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం. 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500, తల్లికి వందనం కింద రూ.15 వేలు, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. రైతుకు ఏడాదికి రూ.20 వేలు సాయం చేస్తాం’ అని ప్రకటించారు.

రాజధాని మూడు ముక్కలాట

సీఎం జగన్ అమరావతిని సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తాను అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అందరూ సహకరించారని తెలిపారు. కానీ, ఈ ముఖ్యమంత్రి మూడు ముక్కలాట ఆడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలాసం కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండలో బిల్డింగ్ కట్టుకున్నారని విమర్శించారు. ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏండ్లు వెనక్కి పోతుందని ఫైర్ అయ్యారు.

వెబ్ స్టోరీస్