తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత దుకాణం పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కంఫర్ట్గా లేరని, అందుకే సొంతంగా వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిపారు.
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత దుకాణం పెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కంఫర్ట్గా లేరని, అందుకే సొంతంగా వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. ‘మహబూబ్ నగర్లో కాంగ్రెస్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా రేవంతే చెప్తున్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ఆయనే అంటున్నారు. కాంగ్రెస్లో కొనసాగటం కంటే 30 మంది ఎమ్మెల్యేలతో సొంత దుకాణం పెట్టుకోవాలని రేవంత్ చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. పీసీసీ పదవి వేరే.. సీఎం పదవి వేరేనని వెల్లడించారు.
కాంగ్రెస్లో నంబర్ 2 కోసం పోటీ నడుస్తోందని, రెండో స్థానం కోసం ఐదుగురు పోటీలో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెనుక కుట్ర జరుగుతోందని బాంబ్ పేల్చారు. కాగా, తెలంగాణలో త్వరలో రామరాజ్యం రాబోతున్నదని జోస్యం చెప్పారు. కుట్రలు చేసే ఆలోచన తమకు లేదని, కాంగ్రెస్ వాళ్లే వాళ్ల ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని పేర్కొన్నారు.