||అయోధ్య రామమందిరం Photo: Instagram||
శ్రీరాముడు అయోధ్యాపురిలో కొలువుదీరే అద్భుత సన్నివేశానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. జనవరి 22న అంగరంగ వైభవంగా నిర్వహించే కార్యక్రమాల నడుమ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు. రామ్ లాలా విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో అయోధ్యలో వారం పాటు కార్యక్రమాలు జరగనున్నాయి.
వారం పాటు జరిగే కార్యక్రమాలివే..
జనవరి 16: వేద పండితులతో సర్వ ప్రాయశ్చిత్ హోమం, దశవిద్ స్నానం
జనవరి 17: అయోధ్యలో రామ్లాలా విగ్రహంతో ఊరేగింపు
జనవరి 18: గణేశ్ అంబికా, వాస్తు పూజా కార్యక్రమాలు
జనవరి 19: అగ్ని స్థాపన, నవగ్రహ స్థాపన
జనవరి 20: సరయూ నది పవిత్ర జలంతో ఆలయ గర్భ గుడి సంప్రోక్షణ
జనవరి 21: 125 కలశాలతో దివ్య స్నానం
జనవరి 22: రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ