||ప్రతీకాత్మక చిత్రం Photo: twitter||
ఈవార్తలు, బిజినెస్ న్యూస్: బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ ప్రకటించింది. కేవలం నెలకు రూ.198తో బ్రాడ్బ్యాండ్ సేవలు అందించనున్నట్లు వెల్లడించింది. బ్యాకప్ ప్లాన్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నామని, ఈ ప్లాన్లో యూజర్లు 10 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు పొందవచ్చని వివరించింది. ఈ ప్లాన్ తీసుకొనే యూజర్లు అదనంగా రూ.21 నుంచి రూ.152 వరకు చెల్లించి ఇంటర్నెట్ వేగాన్ని 30 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు పెంచుకోవచ్చని పేర్కొంది.